ఎంఎస్​ఎంఈపై టీజీ రెడ్కో ముందడుగు

by Ajay Maddhiboyina |

పెట్టుబడుల ఆకర్షణలో ముందుంటున్న తెలంగాణ రాష్ట్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు క్లస్టర్లను అభివృద్ధి చేయడంలోనూ సత్తా చాటుతోంది.

ఎంఎస్​ఎంఈపై టీజీ రెడ్కో ముందడుగు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడుల ఆకర్షణలో ముందుంటున్న తెలంగాణ రాష్ట్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు క్లస్టర్లను అభివృద్ధి చేయడంలోనూ సత్తా చాటుతోంది. ఎంఎస్​ఎంఈ క్లస్టర్​డెవలప్​మెంట్​ప్రొగ్రాం (పీడీపీ) కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు ఇండస్ట్రియల్​పార్కులను అభివృద్ధి చేస్తు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్​18వ శాతంలోనూ, మధ్య ప్రదేశ్​11వ స్థానంలోనూ, ఉత్తర ప్రదేశ్​10వ స్థానంలోనూ, తమిళనాడు రాష్ట్రం 9వ స్థానంలో ఉన్నాయి. ఈ విధంగా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణనే అగ్రస్థానంలో ఉండడం విశేషం.

మహబూబ్​నగర్​జిల్లా జడ్చర్లలో లెదర్​డిజైన్​క్లస్టర్​, మెదక్​జిల్లా దుద్దెడలో జనరల్​ఇంజనీరింగ్​, ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రికల్​పార్కు , ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఫుడ్​ప్రాసెసింగ్​పార్కు ఇలా వివిధ ఎంఎస్​ఎంఈ క్లస్టర్లు ఏర్పాటు అవడంలో తెలంగాణ రెడ్కో సహయ సహకారాలను అందిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 15న హర్యానా రాష్ట్రంలోని పానిపట్ లో ఈ మేరకు ఎంఎస్​ఎంఈ లలో ఇంధన సామర్ద్యాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమావేశంలో టీజీ రెడ్కోకు అభినందనలు వెల్లువెత్తనున్నాయి. రెడ్కో సంస్థ ఈ రంగంలో తీసుకున్న చర్యలు తదితరాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Next Story