ప్రశాంతంగా ముగిసిన టీజీ పీజీఈసెట్.. 90.64 శాతం హాజరు

by Ramesh Naini |

రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో (2026-27) ప్రవేశాల కోసం జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ పీజీఈసెట్’ పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి.

ప్రశాంతంగా ముగిసిన టీజీ పీజీఈసెట్.. 90.64 శాతం హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో (2026-27) ప్రవేశాల కోసం జేఎన్టీయూహెచ్ (JNTUH) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ పీజీఈసెట్’ పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు రోజుకు రెండు సెషన్ల చొప్పున మొత్తం 19 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు.

హైదరాబాద్, వరంగల్ పరిధిలో మొత్తం 26,077 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 23,637 మంది (90.64%) పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.

Next Story