- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: హైకోర్టులో కేటీఆర్కు బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టివేసిన ధర్మాసనం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు హైకోర్టు (High Court)లో భారీ ఊరట లభించింది. ఆయనపై నిర్మల్ జిల్లా (Nirmal District) ఖానాపూర్ (Khanapur) నియోజకవర్గ పరిధిలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ (Utnoor Police Station)లో నమోదైన కేసును ధర్మాసనం ఇవాళ కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించింది. అయితే, రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ (Musi Project) దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్లో జరిగిన ఓ సభలో కేటీఆర్ (KTR) ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికల కోసం కావలసిన నిధులను కాంగ్రెస్ (Congress) మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank)లా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ (Aathram Suguna) ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఉట్నూరు పోలీసులు కేటీఆర్పై BNS సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు. కాగా, తాజాగా ఆ కేసులో వాదోపవాదాలు విన్న హైకోర్టు ధర్మాసనం కేటీఆర్పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఇవాళ తుది తీర్పును వెలువరిచింది.






