TG Budget: లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-20 07:38:54  IST  )

పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2026-27 బడ్జెట్‌లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

TG Budget: లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, ఆసరా అవసరమైన వారికి భారీ ఊరటనిచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో భాగంగా కొత్తగా మరో 2 లక్షల మందికి ‘చేయూత’ పెన్షన్లు (Cheyutha pensions) మంజూరు చేయనన్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రామర్క ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన సుమారు 2 లక్షల మందికి ఈ ఏడాది నుంచి కొత్తగా పెన్షన్లు అందనున్నాయి. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలగకుండా బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించారు. అయతే, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సామాజిక భద్రతా పింఛన్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు.. సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Next Story