- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక వంతు.. బరిలో ఎంతమంది ఉన్నారో తెలుసా?
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఇక త్వరలోనే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నిక కోసం మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. మే 27న పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ను నిర్వహించనున్నారు. ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. పొలింగ్ ముగిసిన తరువాత జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Next Story






