ఆమె లేకుంటే.. KCR తలకిందులు తపస్సు చేసిన తెలంగాణ వచ్చేది కాదు: MP ఉత్తమ్

by Disha Web Desk 19 |
ఆమె లేకుంటే.. KCR తలకిందులు తపస్సు చేసిన తెలంగాణ వచ్చేది కాదు: MP ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ లేకుంటే స్వరాష్ట్రం ఏర్పడకపోయేదని ఎంపీ ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలతో సోనియమ్మ చలించడం వలనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజల ఆంక్షాలకు పార్టీ మద్ధతు ఇచ్చిందన్నారు. లోక్​సభ స్పీకర్‌గా మీరాకుమార్​గతంలో తెలంగాణ పక్షాన నిలిచారన్నారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె హైదరాబాద్‌కు వస్తే సీఎం కేసీఆర్ సపోర్టు చేయలేదన్నారు.

కనీసం ఫోన్ కూడా లిప్ట్ చేయలేదన్నారు. ప్రస్తుతం 9 ఏళ్లు గడిచినప్పటికీ, ఉద్యోగాల విషయంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉన్నదన్నారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించడం సరికాదన్నారు. సోనియా గాంధీ సహకరించకుంటే, కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదని ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. బిల్లు పాస్​అయిన రోజు కేసీఆర్​పార్లమెంట్‌లో లేరన్నారు. నేరేళ్ళ బాధితులను పరామర్శించేందుకు మీరాకుమార్ వస్తే, కేసీఆర్ అవహేళన చేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​వేవ్​ఉన్నదని, రాష్ట్రం ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఉత్తమ్ కోరారు.



Next Story