HYD: నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత

by Disha Web Desk 2 |
HYD: నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ శనివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం గేటు ముందు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆందోళనకు దిగారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలతో గేటు ముందు బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు మహిళా కాంగ్రెస్ నాయకురాలుకు మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Next Story