- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టాల్లో ఉన్న రైస్మిల్లు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి
by Naga Rani Yarlagadda |
రైతులు పండించిన ధాన్యం సీఎంఆర్ చేసేందుకు వెంటనే రైస్మిల్లులకు కేటాయించి మిల్లులను ఆదుకోవాలని రైస్ మిల్లర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

X
- మిల్లుల పెనాల్టీ, వడ్డీ మాఫీ చేసి సీఎంఆర్కు ధాన్యం కేటాయించాలి : రైస్మిల్లర్ల అసోసియేషన్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైస్మిల్లర్ల పరిశ్రమ చాలా కష్టాల్లో ఉందని, రైతులు పండించిన ధాన్యం సీఎంఆర్చేసేందుకు వెంటనే రైస్మిల్లులకు కేటాయించి మిల్లులను ఆదుకోవాలని రాష్ట్ర రైస్మిల్లర్ల వెల్ఫేర్అసోసియేషన్అధ్యక్షులు పాడి గణపతి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణ వ్యాప్తంగా 350 నుంచి 400 రైస్ మిల్లులు 100 శాతం బియ్యం సరఫరా చేసి 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డిలేని డిఫాల్ట్లిస్టులు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈమిల్లుల పెనాల్టీ, వడ్డీ మాఫీ చేసి రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కేటాయించాలని కోరారు. నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వ పెద్దలు తమ సమస్యలను పరిష్కరించి పరిశ్రమను కాపాడాలని సూచించారు. అదే విధంగా రైతులకు ధాన్యం సమస్య రాకుండా మిల్లర్లకు కేటాయిస్తే సకాలంలో సీఎంఆర్చేసి అందిస్తామని పేర్కొన్నారు.
Next Story






