Republic Day Parade: రిపబ్లిక్​డే పరేడ్‌కు తెలంగాణ వారికి ప్రత్యేక ఆహ్వానం

by Gantepaka Srikanth |

న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌(Kartavya Path)లో గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు తెలంగాణ నుంచి ప్రత్యేకంగా 41 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

Republic Day Parade: రిపబ్లిక్​డే పరేడ్‌కు తెలంగాణ వారికి ప్రత్యేక ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌(Kartavya Path)లో గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు తెలంగాణ నుంచి ప్రత్యేకంగా 41 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల జాబితా నుంచి వీరిని ఎంపిక చేశారు. తెలంగాణ నుండి ప్రత్యేక అతిథులుగా అదనంగా 41 మంది పేర్లను విడుదల కేంద్ర రక్షణశాఖ విడుదల చేసింది. వీరు ఢిల్లీకి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నోడల్ అధికారులను నియమించారు. ఎంపికైన వారిలో ప్రధానమంత్రి యశవి స్కీమ్, టెక్స్‌టైల్ (హస్తకళలు), డబ్ల్యూసీడీ (హస్తకళలు)కి గణనీయంగా సహకరించిన వ్యక్తులు. పరేడ్‌ను వీక్షించడానికి పాన్-ఇండియా నుండి ఆహ్వానించబడిన ప్రత్యేక అతిథులు వివిధ రంగాలలోని వివిధ రంగాలకు చెందినవారు ఉన్నారు.

ఇందులో వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారు, ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా ఉపయోగించుకున్నవారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన ప్రత్యేక అతిథుల కేటగిరీల మొత్తం జాబితాలో పీఎం యశస్వి స్కీం నుంచి 23 మంది, టెక్స్ టైల్స్(హస్తకళలు) నుంచి 3, డబ్ల్యూసీడీ (హస్తకళలు) నుంచి 5, రూరల్ డెవలప్మెంట్ విభాగం నుంచి 12, రిపబ్లిక్ డే పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ గా అంకం రాజేశ్వర్, పీఎం జన్మన్ , గిరిజన వ్యవహారాల విభాగం నుంచి 7, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ట్రెయిని డీజీటీ శ్రావ్య, పీఎం మత్స్య సంపద యోజన పధకం లబ్దిదారులు 4, వారికి నోడల్ ఆఫీసర్గా మహ్మద్ ఖాదీర్ అహ్మద్, మన్ కీ బాత్ పోగ్రాంలో పాల్గొన్న అభ్యర్థులు 15 మంది ఉన్నారు.

Next Story