- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు
రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపికైన గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఢిల్లీలో జరిగే స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపికైన గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఢిల్లీలో జరిగే స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఐదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఢిల్లికి ఆహ్వానించింది. పంచాయతీ కార్యదర్శులు జే.షర్మిల, ఆర్.శ్రీనివాస్ రెడ్డి, వి.శ్రీనివాస్, ఎం.దస్తగిరి, ఆర్,రాంకిషోర్, వైవీ రాజులు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు. వీరు ప్రధానమంత్రి నరేంద్రమోడి జాతీయ జెండా ఎగురవేసే ఎర్రకోటలో వీరికి పాల్గొంటారు. ఈ కార్యక్రమంతో పాటుగా గురువారం సాయంత్రం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన సమావేశంలోనూ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలను ఇదే స్పూర్తితో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ అన్నారు.






