- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: మా జోలికి రావొద్దు.. ఏపీ మంత్రి కారుమూరికి హరీశ్రావు వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి తెలంగాణ మంత్రి హరీశ్రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి కారుమూరి ఎగిరెగిరి పడతున్నారని, అనవసరంగా తమ జోలికి రావొద్దని ఆయన హెచ్చరించారు. తెలంగాణలోని ఏపీ కార్మికులు అక్కడ ఓటు రద్దు చేసుకుని ఇక్కడ తీసుకోవాలన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి వచ్చి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అంతేఘాటుగా హరీశ్రావు స్పందించారు. ఏపీ నేతలు గతంలో ప్రత్యేక హోదా అడిగారని.. ఇప్పుడు ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను అధికార, ప్రతిపక్ష పార్టీలు మర్చిపోయాయని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీలు ఏపీని ఆగం చేశాయని ఆరోపించారు. ప్రజలను గాలికి వదిలేసి.. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్రావు విమర్శించారు.