టీడీపీ జాతీయ కమిటీ ప్రకటన.. తెలంగాణ నేతలకు చోటు

by Gantepaka Srikanth |

తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ప్రతి కమిటీలోనూ కొత్త వారికి అవకాశం దక్కింది.

టీడీపీ జాతీయ కమిటీ ప్రకటన.. తెలంగాణ నేతలకు చోటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ప్రతి కమిటీలోనూ కొత్త వారికి అవకాశం దక్కింది. మొత్తం 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ నియమించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలకు సైతం చోటు దక్కింది. పొలిట్ బ్యూరో సభ్యులుగా నాంపల్లి నియోజకవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్, షాద్‌నగర్‌కు చెందిన బక్కిన నరసింహులు నియామకం అయ్యారు. జాతీయ అధికార ప్రతినిధిగా అంబర్‌పేట్ నియోజకవర్గానికి చెందిన టి.జ్యోత్స్న, ఉప్పల్‌కు చెందిన నన్నూరి నర్సిరెడ్డి నియామకం అయ్యారు.

Next Story