మెడికల్ స్టూడెంట్స్‌కు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్

by Disha Web Desk 19 |
మెడికల్ స్టూడెంట్స్‌కు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ స్టూడెంట్స్‌కు శుభవార్త చెప్పింది. మెడికల్ విద్యార్థులకు అందించే స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాజాగా పెంచిన 15 శాతం స్టైఫండ్ 2023 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లు, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదివేవారికి ఈ స్టైఫండ్ పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఇక, స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Also Read..

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే!

Next Story