మనం సంతోషంగా ఉందాం.. ఇతరులను సంతోషంగా ఉంచుదాం: గవర్నర్

by Disha Web Desk 2 |
మనం సంతోషంగా ఉందాం.. ఇతరులను సంతోషంగా ఉంచుదాం: గవర్నర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆకాంక్షించారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఏడాదంతా సుఖఃశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.2024లో అన్ని సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా విజయవంతమైన పోరాటాన్ని కొనసాగించి, సమానమైన, న్యాయమైన, స్నేహపూర్వకమైన, అందరినీ కలుపుకొని, శాంతియుతమైన, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని తీసుకురావడానికి అందరం ఒక నిర్ణయం తీసుకుందామన్నారు. మనం సంతోషంగా ఉందాం.. ఇతరులను సంతోషంగా ఉంచుదాం.. మనమందరం మన అభివృద్ధికి, రాష్ట్ర మరియు దేశ అభివృద్ధికి కట్టుబడి పని చేద్దామని పిలుపు నిచ్చారు. అందరికీ సంతోషకరమైన, సంపన్నమైన నూతన సంవత్సరానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


Next Story

Most Viewed