తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్​సీజన్‌లో రైతులకు అందించే రైతుభరోసా ఆర్థికసాయం మంగళవారం శిల్పాకళా వేదికగా సీఎం రేవంత్​రెడ్డి విడుదల చేశారు.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్​సీజన్‌లో రైతులకు అందించే రైతుభరోసా ఆర్థికసాయం మంగళవారం శిల్పాకళా వేదికగా సీఎం రేవంత్​రెడ్డి విడుదల చేశారు. మొదటిరోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాలోకి రూ.2482.02 కోట్లు జమ కానున్నాయి. ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సీజన్​లో 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు దశలవారీగా పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. మరిన్ని వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.


Next Story