ఊహించని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

by Malleboina Mahesh |

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు కీలక బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఊహించని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భాగమైన మూడు కీలక బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, డిజైన్ లోపాలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. మేడిగడ్డ (Madigadda,), అన్నారం (annaram), సుందిళ్ల బ్యారేజ్‌ (Sundilla Barrage)ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల (Barrage renovation designs)కు ఆహ్వానం పలికింది. ఆ మూడు బ్యారేజీల డిజైన్‌ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో NDSA కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్‌, రిపోర్టేషన్‌ డిజైన్లు రుపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం అక్టోబర్‌ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కంపెనీలకు గడువు ఇచ్చింది.

Next Story