- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Good News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వ ఉద్యోగులకు పండగపూట గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (DA) పెంచుతూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు 3.64% డీఏ పెంచగా.. ఇది 2022 జులై 1వ తేదీ నుండి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెరిగిన డీఏ నవంబర్ జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లింపులు చేయనున్నారు. ఇక 2022 జులై నుండి 2024 అక్టోబర్ 31 వరకు గల డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. 2025 మార్చిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల డీఏ బకాయిలు మాత్రం 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే జీపీఎఫ్ ఖాతాలు లేని కంటిజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 బకాయిల్లో ఈ మొత్తం అందివ్వనున్నారు.
Next Story






