- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాజ్భవన్ రూటే సెపరేట్.. కేసీఆర్ కంటే ముందే తమిళిసై జాతీయ పతాకావిష్కరణ!
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహించే అవతరణ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఫస్ట్ టైమ్ రాష్ట్రంలోనే అధికారికంగా ఈ ఉత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నది.
ఈ రెండూ కొనసాగుతుండగానే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అదే రోజు ఉదయం 9.00 గంటలకు రాజ్భవన్లో విడిగా ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించనున్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. ఆ తర్వాత 10 గంటల నుంచి ఒక గంట పాటు శుభాకాంక్షలు తెలియజేయడానికి టైమ్ రిజర్వు చేసుకున్నారు. సాధారణ ప్రజానీకంతో పాటు వివిధ ప్రజా సంఘాలు, ఆర్గనైజేషన్లు, సొసైటీల ప్రతినిధులు రావచ్చని రాజ్భవన్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story