అసెంబ్లీ కౌన్సిల్, గాంధీ భవన్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

by velandi.Saikiran |   (  Updated:2025-06-02 17:09:53  IST  )

తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్​

అసెంబ్లీ కౌన్సిల్, గాంధీ భవన్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
X

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– పతాకావిష్కరణలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే, గాంధీ భవన్ లో నిర్వహించిన వేడుకలలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సేవాదల్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అమీర్ అలీఖాన్, బలమురి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎంపీ లు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు నూతి శ్రీకాంత్, మెట్టు సాయి కుమార్, అజ్మత్, కొత్వాల్, తహర్ బీన్ అహ్మదాని తదితరులు పాల్గొన్నారు.

Next Story