- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Farmers Commission: రైతు కమిషన్పై పల్లా రాజేశ్వర్రెడ్డికి అవగాహన లేదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో రైతు కమిషన్ పునరావాస కేంద్రమని చేసిన వ్యాఖ్యలపై రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో రైతు కమిషన్ పునరావాస కేంద్రమని చేసిన వ్యాఖ్యలపై రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేసిందని, దాని గురించి అవహేళన చేయడమంటే రాష్ట్రంలోని రైతులను అవహేళన చేసినట్లే అవుతుందని కమిషన్చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటైన తర్వాత కమిషన్ బృందం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటన చేసిందని, వ్యవసాయ క్షేత్రాలను, మార్కెట్ యార్డులను సందర్శించింది. కమిషన్ కార్యాలయంలో అనేక సమావేశాలు నిర్వహించిందన్నారు.
గత పాలకులు రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఎలాంటి అవగాహన లేకపోయిన రైతు సమన్వయ సమితి చైర్మన్ గా ఉండి, రైతులకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి పని చేయకుండా సొంత పని చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ఎమ్మెల్యేలు రైతుల పట్ల వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుంటే రైతు కమిషన్ కార్యాలయానికి వచ్చి కమిషన్ చేపట్టే కార్యక్రమాలపై అవగాహన చేసుకోవచ్చని సలహా ఇచ్చారు.






