T-కాంగ్రెస్ మరో బిగ్ ప్లాన్.. ఈ సారి రంగంలోకి డీకే!

by Disha Web Desk 19 |
T-కాంగ్రెస్ మరో బిగ్ ప్లాన్.. ఈ సారి రంగంలోకి డీకే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌లో ఉన్న కాంగ్రెస్​పార్టీ, తెలంగాణలోనూ ఆ రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నది. ప్రజల మెప్పును పొందేందుకు డిక్లరేషన్ల పేరిట ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే రైతు, యూత్​డిక్లరేషన్‌లు ప్రకటించగా, త్వరలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. దీన్ని విడుదల చేసేందుకు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్యలను టీపీసీసీ ఆహ్వానించినట్లు సమాచారం. ఆ నేతలు కూడా తెలంగాణ రాకకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చినట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో భారీ సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాలని కాంగ్రెస్​ పార్టీ ప్లాన్​ చేస్తోన్నది. హైదరాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మ టౌన్‌లను సభ కోసం పరిశీలిస్తున్నారు. గ్రౌండ్ సక్సెస్​ చేసేందుకు సభాస్థలి ఎంపిక బాధ్యతలకు కూడా కాంగ్రెస్​పార్టీ కమిటిని వేసింది.


Next Story

Most Viewed