- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy), మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ పర్యటన (Delhu tour) కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy), మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ పర్యటన (Delhi tour) కొనసాగుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం (ఫిబ్రవరి 7) ఉదయం 11 గంటలకు ఏఐసీసీ (AICC) అధినాయకులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక అంశాలు చర్చించనున్నారు. అలాగే, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు మంత్రులపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కూడా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలపైనే చర్చించినట్లు సమాచారం.
Next Story






