- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ కేబినెట్ భేటిలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదిస్తారు. బీసీ గణనకు మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నమోదు చేసుకున్న వివరాలతో తుది గణననకు ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. వీటితో పాటుగా బడ్జెట్ సమావేశాల తేదీలను అధికారికంగా ఖరారు చేస్తారు.
ఏ రోజున ప్రారంభమయ్యేది, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను తదితర వాటిని ఖరారు చేస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దీనితో పాటుగా టూరిజం పాలసీకి ఆమోదం తెలపనుంది. వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పోస్టులు క్రియెట్ చేయడం, వాటికి ఆమోదించనుంది. మరికొన్ని అంశాలకు ఆమోదముద్ర వేయనుంది.






