13 మందిని సస్పెండ్ చేసిన తెలంగాణ బీజేపీ

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికలలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిపై బీజేపీ వేటు వేసింది.

13 మందిని సస్పెండ్ చేసిన తెలంగాణ బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నందున రాష్ట్ర క్రమశిక్షణ సంఘం వారిని సస్పెండ్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లగా వారి సూచన మేరకు సోమవారం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీలో సాంబారి కళావతి, అరవ లక్ష్మి, ముద్దం రాము, రావతి రాజు, కొక్కుల ధర్మేంద్ర, సిరికొండ భారతి, పులి శ్రీధర్, మెట్ పల్లి లో మరి సంద కిశోర్, ఆర్మూర్​ప్రశాంత్, బొండ్ల నరేష్, కోరుట్ల నుంచి ఇందూరి సత్యం, అయిలాపూర్​పద్మ, తోట రాజేశం సస్పెండ్​చేశారు. ఈసస్పెన్సన్​తక్షణమే అమలుల్లోకి వస్తోందని, నేటి నుంచి వారం రోజులోపు వారంతా తమ ప్రవర్తనపై రాష్ర్ట పార్టీకి వివరణ ఇవ్వాలని రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ కన్వీనర్​రవీందర్​విశ్వనాథ్​ కోరారు.

Next Story