BREAKING: ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

by Disha Web Desk 19 |
BREAKING: ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ సెషన్ ముగియడంతో శనివారం రాత్రి శాసన సభను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరవధిక వాయిదా వేశారు. అసెంబ్లీలో ఇవాళ ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టి.. డ్యామేజీకి గురైన మేడిగడ్డ బ్యారేజీ గురించి పవర్ ప్రాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. అనంతరం ఇరిగేషన్ వైట్ పేపర్‌పై అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడించింది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఇరు పక్షాల నేతల డైలాగ్ వార్‌తో అసెంబ్లీ హీటెక్కింది. ఇరిగేషన్‌పై స్వల్పకాలిక చర్చ ముగియడంతో శనివారం రాత్రి అసెంబ్లీ స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు.

Next Story

Most Viewed