తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సర్క్యూలర్

by Disha Web Desk 2 |
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సర్క్యూలర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సర్క్యూలర్ జారీ చేశారు. అంతేకాకుండా.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు గెజిట్ నోఫికేషన్ కూడా విడుదల చేశారు. కాగా, నిన్న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్‌ పార్టీ అధికారం కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టారు. దీంతో తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన పదేళ్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గత అసెంబ్లీని రద్దు చేస్తూ.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు గవర్నర్ సర్క్యూలర్ చేస్తూ సోమవారం గెజిట్ నోటికేషన్ జారీ చేసింది.

Next Story

Most Viewed