తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. ఇక కేసీఆర్ పని అయిపోయినట్టేనా..!

by Disha Web Desk 16 |
తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. ఇక కేసీఆర్ పని అయిపోయినట్టేనా..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజల రక్తాన్ని సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం జలగల్లాగా తాగుతున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. Q న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశారని తీన్మార్ మల్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే కొత్త పార్టీ అని చెప్పారు. ఇక ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తోందని, కానీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేకపోయిందని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ ఇళ్లు కట్టి పేదలకు ఇచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ జీతం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు తాను పెట్టబోయే కొత్త పార్టీ భిన్నంగా ఉంటుందంటున్న తీన్మార్ మల్లన్నతో మా దిశ న్యూస్ స్పెషల్ ఇంటర్వూ.. వీడియోలో చూడగలరు.


Next Story

Most Viewed