రాజ్ భవన్‌లో ఉపరాష్ట్రపతికి తేనీటి విందు.. హాజరైన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి

by Ramesh Naini |   (  Updated:2025-11-16 13:32:45  IST  )

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.

రాజ్ భవన్‌లో ఉపరాష్ట్రపతికి తేనీటి విందు.. హాజరైన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాదరంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి రాకతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తేనీటి విందు ఏర్పాటు చేశారు. గవర్నర్‌ తేనీటి విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ట్వీట్ ఇదే..

Next Story