తెలంగాణ ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారు.. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్

by Dishafeatures2 |
తెలంగాణ ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారు.. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జన సంపర్క్ పేరుతో జనాల్లోకి వెళ్లాలని 160 రోజుల రోడ్ మ్యాప్ ను ఇచ్చారు. పార్టీ సంస్థాగత మార్పులకు సిద్ధంగా ఉండాలని, అలాగే అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలాడుతోందని విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడంలేదని పీఎం మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు బన్సల్, శివప్రకాశ్ హాజరయ్యారు.


Next Story

Most Viewed