- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈసీకి టీ-కాంగ్రెస్ ఫిర్యాదు
by Satheesh |
బీఆర్ఎస్ ఆపధర్మ ప్రభుత్వంపై టీ కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. శనివారం ఈసీవో కార్యాలయానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఆపధర్మ ప్రభుత్వంపై టీ కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. శనివారం ఈసీవో కార్యాలయానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు ఈసీకి కంప్లెయింట్ చేశారు. ధరణి పోర్టల్లో అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు తమ బినామీల పేర్ల మీదకు బదలాయింపు చేస్తోందని, అలాగే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తోందని అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధు కోసం సమకూర్చిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. అలాగే డిసెంబర్ 4వ తేదీన కేబినెట్ మీటింగ్పై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Next Story






