బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసుల్లో ఆదేశించింది. రేపు (26వ తేదీ) సిట్ ఎదుట విచారణకు రావాలని బండి సంజయ్‌ను సిట్ ఆదేశించింది. కాగా, ఈ కేసులో బండి సంజయ్‌కు సిట్ గతంలోనే నోటీసులు జారీ చేయగా.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హాజరుకాలేనని సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. దీంతో సిట్ మరోసారి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Also Read..

బిగ్ న్యూస్: లింగాల వర్సెస్ బొమ్మెర.. మధిర బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు

Next Story

Most Viewed