- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అసలు విషయం గ్రహించిన ప్రజలు.. ‘జూబ్లీహిల్స్’తో మరోసారి నిరూపితం!
సమాజంలో ఎవరైనా చనిపోతే వారి పట్ల, ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపిస్తాం.. అయ్యే పాపం అంటాం.. మరణించిన వారితో ఎన్ని విబేధాలు ఉన్నా.. చనిపోయిన తర్వాత మాత్రం వారిపై అభండాలు, విమర్శలు చేయకుండా వారి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తాం.

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో ఎవరైనా చనిపోతే వారి పట్ల, ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపిస్తాం.. అయ్యే పాపం అంటాం.. మరణించిన వారితో ఎన్ని విబేధాలు ఉన్నా.. చనిపోయిన తర్వాత మాత్రం వారిపై అభండాలు, విమర్శలు చేయకుండా వారి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తాం. అయితే తెలంగాణలో మాత్రం సిట్టింగ్ఎమ్మెల్యేలు చనిపోయినా సానుభూతి పవనాలు మాత్రం రావడంలేదు. వారి ఫ్యామిలీ మెంబర్ల పట్ల సానుభూతి చూపడంలేదు. సానుభూతి చూపుతున్నా.. అది ఓటు వరకు రావడం లేదని స్పష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి ఇప్పటి వరకు ఐదుగురు సిట్టింగ్ఎమ్మెల్యేలు చనిపోయారు. మెదక్జిల్లా నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.కృష్టారెడ్డి, దుబ్బాక బీఆర్ఎస్శాసనసభ్యుడు రామలింగారెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్రెడ్డి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహ్మయ్య, హైదరాబాద్జిల్లా కంటోన్మెంట్ఎమ్మెల్యే లాస్య నందిత, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్లు పదవీలో కొనసాగుతూ చనిపోయారు. అలాగే కంటోన్మెంట్ఎమ్మెల్యేగా ఉండి సాయన్న చనిపోయారు.
అయితే అప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో ఈసీ ఉప ఎన్నిక నిర్వహించలేదు. ఆ తర్వాత జరిగిన జనరల్ఎన్నికల్లో బీఆర్ఎస్నుంచి ఆయన కూతురుకు అవకాశం కల్పించారు. ఆమె గెలిచిన కొద్దినెలల్లోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాగా, ఆమె సొదరి నివేదితకు బీఆర్ఎస్అవకాశం కల్పించింది. అయితే ఆమెపై కాంగ్రెస్అభ్యర్థి శ్రీగణేశ్గెలుపొందారు. అలాగే నారాయణఖేడ్సిట్టింగ్ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి చనిపోయారు. ఆయన కుమారుడు పి.సంజీవరెడ్డి పోటీచేసి ఓటమిపాలు కాగా అధికార బీఆర్ఎస్అభ్యర్థి భూపాల్రెడ్డి విజయం సాధించారు. చివరికి 2023లో కిష్టారెడ్డి కొడుకు సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకట్రెడ్డి మరణించడంతో భార్య సుచరిత రెడ్డికి కాంగ్రెస్పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. ఆమెపై ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును బీఆర్ఎస్బరిలో దింపగా గెలుపుపొందారు. రెండుచోట్ల కూడా చనిపోయిన వారి సానుభూతి పనిచేయలేదు.
అధికార పార్టీకే గెలుపు అవకాశాలు
ఆ తర్వాత నల్గొండ జిల్లా నాగార్జునసాగర్నుంచి బీఆర్ఎస్పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన నోముల నర్సింహ్మయ్య మరణించారు. ఆయన స్థానంలో కుమారుడు భగత్కు టిక్కెట్టు ఇచ్చారు. అయితే కాంగ్రెస్నుంచి జానారెడ్డి పోటీ చేయగా అక్కడ మాత్రం నర్సింహ్మయ్య కొడుకు గెలుపొందారు. సానుభూతితో పాటు అబివృద్ధి నినాదం పనిచేసిందని చెప్పవచ్చు. అక్కడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థే విజయం సాధించారు. ఉమ్మడి మెదక్జిల్లాకు చెందిన దుబ్బాక బీఆర్ఎస్ఎమ్మెల్యే ఎస్ రామలింగారెడ్డి మృతితో ఆయన భార్య సుజాత పోటీ చేయడంతో ఇక్కడ అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. సానుభూతి, అధికార పార్టీ రెండు పనిచేయలేదని ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైంది.
తాజాగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్సిట్టింగ్ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్మరణించారు. ఆయన భార్య సునీతకు టిక్కెట్టు ఇవ్వగా కాంగ్రెస్పార్టీ నవీన్యాదవ్ను బరిలో నిలిపింది. ఇక్కడ కూడా సానుభూతి పనిచేయలేదు. అధికార పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇదీలా ఉండగా ఇప్పటి వరకు ఆరు స్థానాల్లో సిట్టింగ్ఎమ్మెల్యేలు చనిపోతే ఉప ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఇచ్చినా ఒక్క నాగార్జునసాగర్ మినహా ఎక్కడా ఫలితం సానుకూలంగా రాలేదు. దుబ్బాకలో తప్ప అన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థే గెలుపొందారు. ఈ నేపథ్యంలో సానుభూతి కంటే అధికార పార్టీ పవర్, అధికార పార్టీ అయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు, ఓటర్లు గ్రహించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






