- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యువతి అనుమానాస్పద మృతి
by Disha Web Desk 4 |
X
దిశ, శేరిలింగంపల్లి : మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ 15వ అంతస్తుపై నుంచి పడి ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొండాపూర్లోని మై హోమ్ మంగళ అపార్ట్మెంట్లో ఉత్తరప్రదేశ్కు చెందిన కు ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంట్లో పనిచేసేందుకు ఉత్తరప్రదేశ్ నుండి వర్ష( 18) అనే యువతిని తీసుకువచ్చారు.
ఆమె మై హోమ్ మంగళలో పనిచేస్తూ అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అపార్ట్మెంట్ 15వ అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుండి దూకి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె దూకిందా లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Next Story