యువతి అనుమానాస్పద మృతి

by Disha Web Desk 4 |
యువతి అనుమానాస్పద మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ 15వ అంతస్తు‌పై నుంచి పడి ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొండాపూర్‌లోని మై హోమ్ మంగళ అపార్ట్మెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కు ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంట్లో పనిచేసేందుకు ఉత్తరప్రదేశ్ నుండి వర్ష( 18) అనే యువతిని తీసుకువచ్చారు.

ఆమె మై హోమ్ మంగళలో పనిచేస్తూ అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అపార్ట్మెంట్ 15వ అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుండి దూకి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె దూకిందా లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.



Next Story