- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం
by velandi.Saikiran |
బీహార్లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం : టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీహార్లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ఎస్ ఐఆర్పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తొలగించబడిన 65 లక్షల ఓటర్ల పేర్లను 48 గంటల్లో వెబ్సైట్లో ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించందన్నారు. గురువారం మహేష్కుమార్గౌడ్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణలు సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైందని తెలిపారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం విచారమని, ఆధార్ లింక్తో ఒక ఓటు – ఒక మనిషి విధానం అమలు చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్పై ఎన్నికల సంఘం స్పందించాలని మహేష్కుమార్గౌడ్ డిమాండ్చేశారు.
Next Story






