ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌కు సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ

by Disha Web Desk 4 |
ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌కు సుకేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: జైలులో నుంచే సంచలన లేఖలు విడుదల చేస్తున్న సుకేష్ చంద్రశేఖర్ తాజాగా మరో లేఖ రాశారు. ఈ సారి ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ కు లేఖ రాసిన ఆయన పలు సంచలన విషయాలను వెల్లడించారు. జైలు అధికారులు తనను మానసికంగా హింసిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, సందీప్ గోయల్ పై ఆరోపణలు విరమించుకోవాలని జైలు అధికారులు వేధించారని లేఖలో తెలిపాడు. విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని ఆరోపించాడు. తన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ ను సుకేష్ చంద్రశేఖర్ కోరాడు.



Next Story

Most Viewed