- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ట్రాన్స్కో, జెన్కో సీఎండీలకు మరోసారి సమ్మె నోటీసుల జారీ
తెలంగాణ విద్యుత్సంస్థలలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్చేయించేందుకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏస

ట్రాన్స్కో, జెన్కో సీఎండీలకు
మరో సారి సమ్మె నోటీసుల జారీ
== తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్వన్ జేఏసీ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్సంస్థలలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్చేయించేందుకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ మరో సారి సమ్మె దిశగా అడుగులు వేస్తోంది. ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్తో పాటు జెన్కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీ డీసీఎల్, యాజమాన్యాలను కూడా కలిసి గురువారం సమ్మె నోటీసులు ఇస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ స్పష్టం చేసింది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్కే. ఈశ్వర్రావు, కన్వీనర్ఎంఏ వజీర్ల నేతృత్వంలో ఆర్టిజన్ ఉద్యోగుల కుటుంబాలతో కలిసి బుధవారం ఈ మేరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించింది.
విద్యుత్సంస్థలపై ఆర్థిక భారం పడని ఆర్టిజన్స్ కన్వర్షన్ను వెంటనే చేపట్టాలని డిమాండ్చేస్తూ కుటుంబ సభ్యులతో బహిరంగ సభకు హాజరైనారు. ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్కే. నాగేశ్వర రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్శాఖలో పని చేస్తున్న 20 వేల మంది ఆర్టిజన్కార్మికులను వారి వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగిగా కన్వర్షన్చేయాలని డిమాండ్ చేశారు. వందల కుటుంబాలు ఈ రంగంలో పని చేస్తున్నా ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోక పోవడం సరికాదన్నారు.
ఈశ్వర్రావు, ఎంఏ. వజీర్లు మాట్లాడుతూ 1998 లో విద్యుత్సంస్థలలో కాంట్రాక్టు కార్మికులుగా చేరిన ఆర్టిజన్లు ప్రస్తుత కాంగ్రెస్ప్రభుత్వంపై కొండంత ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను వడియాసలు చేయవద్దన్నారు. ప్రస్తుతం విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్స్ఉద్యోగులకు వారి విద్యార్హతలను బట్టి జూనియర్లైన్మెన్, సబ్ఇంజనీర్, జూనియర్అసిస్టెంట్, సబార్డినేట్ పోస్టులను ఆర్టిజన్స్తో మాత్రమే కన్వర్షన్చేయాలని ప్రభుత్వానికి , విద్యుత్యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమస్య తీవ్రతను బట్టి జేఏసీతో చర్చలు జరపాలని వారు డిమాండ్చేశారు.






