పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన.. కుప్పగండ్లలో నిలిచిన పోలింగ్‌

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-11 04:11:23  IST  )

మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకుంది.

పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన.. కుప్పగండ్లలో నిలిచిన పోలింగ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda) మండలం కుప్పగండ్ల (Kuppagandla) గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించకపోవడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. ఆ వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. ఇద్దరికి ఎన్నికల సంఘం పక్షాన వచ్చిన బ్యాలెట్ పత్రాల్లో గుర్తులను కేటాయించారు. కానీ మూడో అభ్యర్థి యాదయ్య (Yadaiah)కు గుర్తు కేటాయించకపోవడంతో గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫర్యాదు చేయగా.. పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

Read More..

ఎక్లాస్‌ఖాన్‌పేట్‌లో పరిస్థితి ఉద్రిక్తం.. బాహాబాహీకి దిగిన MLA, MLC వర్గీయులు

Next Story