బోరున విలపించిన MLA రాజయ్య.. అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని కన్నీరుమున్నీరు (వీడియో)

by Disha Web Desk 19 |
బోరున విలపించిన MLA రాజయ్య.. అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని కన్నీరుమున్నీరు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల పార్టీ టికెట్లు ప్రకటిచడంతో.. టికెట్ దక్కని పలువురు పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు అయితే పార్టీ మారే యోచనలో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. మరికొందరూ రెబల్స్‌గా నిలబడి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు అధిష్టానం టికెట్ రాని నేతలను బుజ్జగింపులు చేస్తుంది. కాగా, స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ను బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరికి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ మరోసారి ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య లిస్ట్‌లో పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇవాళ రాజయ్య తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తమ నేతకు టికెట్ దక్కకపోవడంతో రాజయ్య అనుచరులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో రాజయ్య సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని బోరున విలపించారు. మరోవైపు రాజయ్య బీఆర్ఎస్‌లో ఉంటానని చెబుతున్నా.. కాంగ్రెస్‌లోకి వెళ్తారని రాజకీయ వర్గాల్లో ఊహగానాలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed