- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు.. మున్సిపాలిటీల ముసాయిదా ఓటరు జాబితా వెల్లడి
by Kema Shiva Kumar |
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితాను వెల్లడించింది. ఈ ముసాయిదా ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్తార్ కార్యాలయాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపాలిటీ ఆఫీసులోనూ నోటీసు బోర్డులో ప్రచురించారు. దీంతో పాటు మున్సిపల్ వార్డుతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ జాబితాను ప్రచురించారు. ఈ ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించడంతోపాటు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత ఈనెల 10వ తేదిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
Next Story






