- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ పాత భవన పునరుద్దరణ పనులను వేగవంతం చేయండి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశం
by Muthe.Rajitha |
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఉన్న శాసన మండలి భవన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, అగాఖాన్ సంస్థ అధికారులు, అలాగే సంబంధింత అధికారులతో కలిసి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, రానున్న సమావేశాలు ఈ భవనంలో జరపాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర సర్కారు ఉందని గుత్తా సుఖేందర్రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. అలసత్వం వదిలి ఆర్ అండ్ బి శాఖ అధికారులు, అగాఖాన్ సంస్థ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు పనులు వేగంగా చేసి, నిర్ణీత సమయానికి భవనాన్ని అప్పగించాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
Next Story






