- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిటర్న్ జర్నీకి 8 స్పెషల్ ట్రైన్లు

దిశ, వెబ్డెస్క్: సంక్రాంతి (Sankranti) పండుగ సందర్భంగా బతుకుదెరువు కోసం హైదరాబాద్ (Hyderabad) మహా నగరానికి వచ్చిన వారంతా తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. అయితే, తాజాగా పండుగ ముగియడంతో ఒక్కొక్కరుగా మళ్లీ నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుగు ప్రయాణంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్పెషల్ ట్రైన్ల (Special Trains)ను నడుపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
జనవరి 18 నుంచి 20 వరకు ఆ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 18న కాకినాడ (Kakinada) నుంచి ఒకటి, విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి రెండు ట్రైన్లు నూతనంగా ప్రారంభించబడిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal)కు బయలుదేరుతాయి. 19న నరసాపురం (Narasapuram), విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి రెండు ట్రైన్లు చర్లపల్లి (Charlapally)కి రానున్నాయి. అదే రోజు చర్లపల్లి నుంచి విశాఖపట్నం (Vishakhapatnam)కు ఒకటి, భువనేశ్వర్ (Bhuvaneshwar)కు ఒకటి చొప్పున రెండు స్పెషల్ ట్రైన్లు రానున్నాయి. ఈ నెల 20న చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు మరో స్పెషల్ ట్రైన్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ శ్రీధర్ (CH Sridhar) వెల్లడించారు.