Krishna River Board: ఈ నెల 27న కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం

by Ramesh Naini |

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది.

Krishna River Board: ఈ నెల 27న కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Krishna River Management Board) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇన్సెంటివ్‌ రద్దు చేయడంతోపాటు రికవరీ చేయాలని కృష్ణా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బోర్డు ఉద్యోగులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని 2023లో హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌పై చర్చించేందుకు 20వ స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 27న హైదరాబాద్‌ జలసౌధ ప్రాంగణంలోని కేఆర్‌ఎంబీ (KRMB) కార్యాలయంలో బోర్డు సభ్యులతో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

Next Story