తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్

by Disha Web Desk 2 |
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ తెలిపింది. వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, వేసవి విడిది లొకేషన్స్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రతి ఏడాది ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోందనే విషయం తెలిసిందే. అంతేకాకుండా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు వేసవి ప్రత్యేక రైళ్లను పెంచుతూ వస్తోన్న సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల కోసం మరికొన్ని సమ్మర్‌ స్పెషల్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి జూన్ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

ఈ మేరకు రైలు వివరాలను శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేసింది. తిరుపతి- అకోలా (07605), అకోలా- తిరుపతి (07606), పూర్ణ- తిరుపతి (07607), తిరుపతి-పూర్ణ (07608), హైద్రాబాద్‌- నర్సాపూర్‌(07631), నర్సాపూర్‌- హైద్రాబాద్‌(07632), హైద్రాబాద్‌- తిరుపతి (07643), తిరుపతి-హైద్రాబాద్‌ (07644), విజయవాడ- నాగర్‌ సోయిల్‌ (07698), నాగర్‌ సోయిల్‌- విజయవాడ(07699) ట్రైన్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించారు. అలాగే కాకినాడ- లింగంపల్లి (07445), లింగం పల్లి- కాకినాడ (07446), మచిలీపట్నం- సికింద్రాబాద్‌ (07185), సికింద్రాబాద్‌- మచిలీపట్నం (07186), తిరుపతి- సికింద్రాబాద్‌ (07481), సికింద్రాబాద్‌- తిరుపతి (07482), మచిలీపట్నం- తిరుపతి (07095), తిరుపతి- మచిలీపట్నం (07096) రైళ్లను కూడా జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Next Story