కాంక్రీట్ పోస్తుండగా కూలిన స్లాబ్.. నలుగురికి సీరియస్

by Disha Web Desk 2 |
కాంక్రీట్ పోస్తుండగా కూలిన స్లాబ్.. నలుగురికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాంక్రీట్ పోస్తుండగా గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వైరా మండలం సోమవరం దగ్గర గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి అధికారులు, పోలీసులు చేరుకున్నారు. నాణ్యతా లోపం కారణంగా జరిగిందా? లేదా మరేదైనా కారణం చేత స్లాబ్ కూలిందా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed