పోటీకి సై అంటున్న సీతక్క కుమారుడు.. ఎక్కడినుంచంటే?

by Disha Web Desk 4 |
పోటీకి సై అంటున్న సీతక్క కుమారుడు.. ఎక్కడినుంచంటే?
X

దిశ, గుండాల: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పినపాక నుండి పోటీ చేసి తీరుతానని ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు సూర్య అన్నారు. మంగళవారం గుండాల మండలంలో పర్యటనకు వచ్చిన ఆయన దిశతో మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గం‌లో కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరలేదని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 30 వేల ఓటు బ్యాంకు నికరంగా ఉందన్నారు. వైఎస్ హయాంలో చేసిన సంక్షేమ ఫలాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు.

ఈ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసి గెలిచి తీరుతానని సూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే గత మూడు మాసాల నుండి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు పర్యటించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఇప్పటికే అనేక మండలాల్లో ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని తెలిపారు.

Next Story