ఢిల్లీ పెద్దలతో వాట్సప్ చాట్.. TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

by Disha Web Desk 19 |
ఢిల్లీ పెద్దలతో వాట్సప్ చాట్.. TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది రోజులుగా ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న సిట్.. విచారణలో నిందితుల నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు రామచంద్రభారతి, నందకూమార్ ఢిల్లీ పెద్దలతో చేసిన వాట్సాప్ చాట్ సంభాషణ వివరాలను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. వాట్సప్ సంభాషణలో కీలక వివరాలు సేకరించిన సిట్.. ఈ వివరాలను హైకోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా ఢిల్లీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కూడా సిట్ కోర్టుకు సమర్పించింది. అయితే, ఢిల్లీ పెద్దలతో నిందితులు చేసిన వాట్సప్ చాట్ సిట్ చేతికి చిక్కడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

READ MORE

కూతురు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు KCR షాక్.. Kavitha పోటీ అక్కడి నుంచేనా?

Next Story