- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.2 వేలకే లైవ్లో శోభనం.. హైదరాబాద్లో బయటపడిన దంపతుల బాగోతం.. తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్!
సోషల్ మీడియా, లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ వాడకం పెరుగుతున్న కొద్దీ కొత్త రకాల ట్రెండ్స్ వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా, లైవ్ స్ట్రీమింగ్ యాప్స్ వాడకం పెరుగుతున్న కొద్దీ కొత్త రకాల ట్రెండ్స్ వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఉండే న్యూడ్ సెక్స్ లైవ్ స్ట్రీమింగ్ కల్చర్ ఇండియాకు పాకింది. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రెండ్ అవుతున్నట్లు కన్పిస్తోంది. సులువుగా డబ్బులు సంపాధించే ప్రయత్నంలో భాగంగా కొందరు మహిళలు అశ్లీల కంటెంట్తో న్యూడ్ కాల్స్.. మొబైల్ లింక్ల ద్వారా మొత్తం చూపించేస్తున్నారు. బూతులతో యువతను ఆకర్షిస్తున్నారు. దీంతో చాలా మంది యువత వీడియోల కోసం ఎగబడి చూడటంతో డబ్బులు బాగా సంపాదిస్తున్న ట్లు తెలుస్తోంది.
తాజాగా హైదరాబాద్ (Hyderabad) నడిబోడ్డున అంబర్పేట ప్రాంతంలో ఓ జంట లైవ్ స్ట్రీమింగ్ బాగోతం బయటపడింది. నాలుగు గోడల మధ్య జరగాల్సిన శృంగారం.. రూ.2 వేలు ఇస్తే లైవ్లో (Shobhanam) శోభనం చూపించేస్తున్నారు. క్వాలిటీ కెమెరాలు ఉపయోగించి.. లైవ్ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను జంట రూపొందించినట్లు తెలిసింది. ఆ జంట స్వీట్ తెలుగు కపుల్ పేరిట అశ్లీల కంటెంట్ క్రియేట్ చేసి.. వీడియోల రూపంలో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. లైవ్ లింక్ కోసం రూ.2000, వీడియో కావాలంటే 500 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. వారికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. డబ్బు కోసం వ్యక్తిగత క్షణాలను వ్యాపారంగా మార్చేస్తున్నారని ఇది తెలిసిన కొంత మంది నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో అలాంటి కల్చర్ ఉండొచ్చు, కానీ మన సమాజానికి తగదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ప్రైవేట్ జీవితాన్ని డబ్బు కోసం బహిర్గతం చేయడం కేవలం వ్యక్తిగత సమస్యలకే కాదు, భవిష్యత్తులో మానసిక ఒత్తిడి, సామాజిక అవమానం కూడా కలిగించవచ్చని సైకాలజిస్ట్లు కూడా ఈ విషయంపై హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో, సోషల్ మీడియా నిపుణులు మాత్రం ఇది ‘క్లౌట్ కల్చర్’ అని అభివర్ణిస్తున్నారు. ‘డబ్బు సంపాదించాలని కొందరు ఏ స్థాయికైనా వెళ్తున్నారు. కానీ ఇలాంటి ధోరణి చివరికి చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. మొత్తంగా చెప్పాలంటే, డబ్బు కోసం వ్యక్తిగత విషయాలు పబ్లిక్గా చూపించడం కొత్త కల్చర్గా మారుతున్నా, సమాజంలో దానికి వ్యతిరేకత కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.






