శివరాజ్ పాటిల్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

నైతిక విలువలు, హుందాతనంతో రాజకీయాలు నడిపిన మహోన్నత వ్యక్తి శివరాజ్ పాటిల్ (Shivraj Patil) మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

శివరాజ్ పాటిల్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నైతిక విలువలు, హుందాతనంతో రాజకీయాలు నడిపిన మహోన్నత వ్యక్తి శివరాజ్ పాటిల్ (Shivraj Patil) మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శివరాజ్ పాటిల్ 7 సార్లు ఎంపీగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారని సీఎం గుర్తు చేశారు. భారతదేశం నిత్యం నిరుపేదల గురించి ఆలోచించే ఓ గొప్ప వ్యక్తి కోల్పోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Next Story