'మధ్యాహ్న భోజనానికి ఆధార్ లింక్‌ను ఎత్తివేయాలి'

by Disha Web Desk 2 |
మధ్యాహ్న భోజనానికి ఆధార్ లింక్‌ను ఎత్తివేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం పోషన్ పోర్టల్‌లో తప్పకుండా ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, దీనిని వెంటనే విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, టి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారని పేర్కొన్నారు.

కనీసం సరైన భోజనం అందని కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాఠశాలలో నైన మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్తుంటారని, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకుండా పోతుందన్నారు. దీంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటికే అనేక మంది వారి వేలిముద్రలు, బయోమెట్రిక్ సమస్యల వల్ల ఆధార్ జారీ కానీ వారు కూడా అనేక మంది ఉన్నారని వివరించారు. ఈ నిర్ణయం ప్రధానంగా పేద విద్యార్ధులకు నష్టదాయకంగా ఉందని, కావున ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed