బీకేర్ ఫుల్ : తెలంగాణలో వడదెబ్బతో ఏడుగురు మృతి

by Dishanational2 |
బీకేర్ ఫుల్ :  తెలంగాణలో వడదెబ్బతో ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో భానుడు భగ భగలతో తన ప్రతాపం చూపెడుతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎండ వేడికి తట్టుకోలేకా చాలా మంది అస్వస్థకు గురి అవుతున్నారు. అంతే కాకుండా ఎండ వేడికి రాష్టవ్యాప్తంగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



Next Story